వానకాలం పంట సాగుకు ముందే ఖాతాలో రైతుబంధు డబ్బులు పడ్డయి. వరి నాట్ల కోసం ఎరువులు సిద్ధం చేసినం. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కోసం సమయానికి రైతుబంధు డబ్బులు అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటం. ఇంతకుముందు పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పడేటోళ్లం. అప్పులు తీసుకొన్నా టైంకు డబ్బులు అందక చాలా పరేషాన్ అయ్యేటోళ్లం. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంక ఇప్పుడు ఆ బాధ లేదు.. ఎట్లయినా పైసలు పడుతాయని తెలుసు.
– రాంమూర్తి, సూరారం, రైతు, కోయిలకొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా