రంగారెడ్డి : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలంలోని ఎల్వెర్తి, మహాలింగపురం, గాజులగూడ గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు, రైతువేదికలు, సీసీ రోడ్లు, గ్రామ సంతలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికి కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రం రావాలనే తపనతో నాడు ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. సీఎం కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చారని, అందుకే రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్లఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.