రేగొండ, మార్చి 27: నీళ్లు లేక పం టలు ఎండుతుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, అయినా ఈ కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, చెంచుకాలనీ, తిరుమలగిరి గ్రా మాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గత పదేండ్లుగా పంటలు సాగు చేస్తున్నా ఎన్నడూ సాగునీరులేక పంటలు ఎండిపోలేదని, ఈ ఏడాది పంట చేతికందే దశలో నీళ్లు లేక ప శువులను మేపుతున్నామని రైతులు వాపోయారు. ఎకరానికి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయామని, ప్రభు త్వం ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. మధుసూదనాచారి జిల్లా వ్యవసాయ, ఇతర అధికారులతో ఫోన్లో మా ట్లాడి వెంటనే పంట నష్టం అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.
సిరికొండ మాట్లాడుతూ.. కాం గ్రెస్ వంద రోజుల పాలనలో సాగు నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు రోడ్డునపడ్డారని తెలిపారు. రేగొండ మండలంలో 250 ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని, ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డి మాం డ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించక పోతే ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.