మంచిర్యాల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా ఎంసీసీ క్వారీలో అరుదైన రూఫస్ బెల్లీడ్ ఈగల్ కనిపించింది. స్థానిక ఆలయ సమీపంలో ఈ నెల 16న హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్బీపీ) సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్దుల్ రహీం ఈ పక్షి ఫొటో తీశారు. చలికాలంలో వలస వచ్చే ర్యాప్టర్ (ఎక్కువ ఎత్తులో ఎగురుతూ భూమి మీదకు వచ్చి చిన్నచిన్న పక్షులు, కీటకాలను వేటాడే జాతి) పక్షిగా రూఫస్ బెల్లీడ్ ఈగల్ ప్రసిద్ధికెక్కింది.
ఈ పక్షి రికార్డుల పరంగా చూస్తే తెలంగాణలో ఇప్పటివరకు కేవలం మూడుసార్లు కనిపించింది. తొలిసారి నాగర్కర్నూల్ జిల్లా ఉమామహేశ్వరం, రెండోసారి భద్రాద్రి జిల్లా గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రం, మూడోసారి పాపికొండ నేషనల్ పార్క్లో ఈ పక్షి చిత్రాలు రికార్డుల్లోకి ఎక్కాయి. మంచిర్యాలలో కనిపించడం ఇదే తొలిసారి అని అటవీ అధికారి తెలిపారు.