యాదాద్రి, జూలై 11: యాదగిరిగుట్ట కొండపై కొలువైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో సోమవా రం స్ఫటిక లింగేశ్వరుడికి అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శివాలయ మాడవీధుల్లో రామలింగేశ్వరుడికి తిరువీధి సేవను జరిపారు. లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వా మి, అమ్మవార్ల నిత్యోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. అన్ని విభాగాల ద్వారా స్వామివారి ఖజానాకు రూ.14,20,793 ఆదాయం సమకూరిందని ఈవో ఎన్ గీత తెలిపారు. కాటేజీల నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన గంగాధర్ రూ.5 లక్షల విరాళం అందజేశారు.