హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): దసరా సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ 4,035 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొ చ్చింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ప్రత్యేక సర్వీసులు ఈ నెల 14 వరకు కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోని ముఖ్య పట్టణాలకు కూడా వీటిని నడుపుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి 3,085 బస్సులను, ఇతర రాష్ర్టాలకు 950 బస్సులను కేటాయించారు. అత్యధికంగా వరంగల్కు 670 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సీట్ల అందుబాటును అప్డేట్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ప్రయాణికులు బస్సులకు సంబంధించిన సమాచారం కోసం 040-68153333, 040-30102829 నంబర్లలో సంప్రదించవచ్చునని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
రేతిఫైల్ బస్స్టేషన్ 9959226154
కోఠి బస్స్టేషన్ 9959226160
జూబ్లీ బస్స్టేషన్ 9959226246
ఎంజీబీఎస్ 9959226257