హైదరాబాద్ : కరీంనగర్ రీజియన్ పరిధిలో నుంచి వేములవాడకు రేపటి వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వేములవాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి వేములవాడకు 14 మినీ బస్సులు ఏర్పాటు చేశారు. ఆలయం వరకు భక్తులు ఉచితంగా ప్రయాణించొచ్చు అని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సులపై శివుడు, శివలింగం, వేములవాడ ఆలయంతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.