హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధంగా ఉన్నదని, అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రూట్లలో తగినన్ని బస్సులు నడుపాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సూళ్ల వేళలకు అనుగుణంగా బస్సులు నడుపాలని, గతంలో నడిపిన అన్ని రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎకువ సమయం వేచి చూడకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో సమయపాలన కచ్చితంగా పాటించాలని, అవసరమైనచోట అదనపు ట్రిప్పులు నడుపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని నాగిరెడ్డి ఆదేశించారు.