నర్సంపేట: నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన ఎండీ ఇమ్రాన్ నర్సంపేట డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఎంబీఏ పూర్తిచేసిన ఆయన కారుణ్య నియామకం ద్వారా కొన్నేండ్ల క్రితం సంస్థలో చేరాడు. ప్రస్తుతం వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో అకౌంట్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పట్టణంలోని పోచమ్మ గుడి దగ్గర ఉన్న తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇమ్రాన్.. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉన్నది.