హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గుర్తింపు సంఘానికి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రెండేండ్లకొకసారి ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని, 2018లో ఎన్నికల సంఘ కాలపరిమితి ముగిసిందంటూ యూనియన్ నాయకుడు కే రాజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తుది విచారణను వాయిదా వేసింది.