హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయితీ ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్లపై 10 శాతం డిసౌంట్ను కల్పించనున్నది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.
ఏప్రిల్ 30 వరకు ఈ డిసౌంట్ ఆఫర్ అమలులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్-తిరుపతి, నిజామాబాద్-బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి.