రఘునాథపల్లి, నవంబర్ 16 : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్టీసీ రాజధాని ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండ నుంచి హైదరాబాద్కు 16 మందితో వెళ్తున్నది. నిడిగొండ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ఓ ఇసుక లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ దోమలగూడకు చెందిన పులంపరి ఓంప్రకాశ్ (75), హనుమకొండ బాలసముద్రానికి చెందిన నవజీత్ సింగ్ (48) అకడికకడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జనగామ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేశ్యాదవ్ తెలిపారు.