హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా పాడేరులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు ప్రయాణికులు మృతిచెందగా, తీవ్ర గాయాలైన పలువురి పరిస్థితి విషయంగా ఉన్నది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్టు సమాచారం.