Vikarabad | వికారాబాద్ : జిల్లా పరిధిలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. అనంతరం బస్సు ఘాట్ రోడ్డులో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పొదల్లో చిక్కుకున్న బస్సును, క్రేన్ సాయంతో బయటకు తీస్తున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.