జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొని హోంగార్డు మృతి(Home guard killed) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, సుబ్బరాజు ఓ హోటల్లో టిఫిన్ తీసుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుబ్బరాజు బైక్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుబ్బరాజు మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
Ratan Tata | గుడ్ బై మై డియర్ లైట్హౌస్.. రతన్ టాటా యువ ఆప్తుడు శంతను నాయుడు పోస్ట్
Ratan Tata | వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..