హైదరాబాద్ : లాలాపేట ఫ్లై ఓవర్పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి నిలిపి, అందులో నుంచి ప్రయాణికులను దించి వేశారు. ఆ తర్వాత మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో 60 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు డ్రైవర్ను అభినందించారు. అయితే, బస్సులో మంటలు ఎలా వచ్చాయి అనేది తెలియరాలేదు.