RS Praveen Kumar | హైదరాబాద్ : అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్లేనా? అని ప్రశ్నించారు.
రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే, పాత అప్పు చెల్లించాల్సిందేనని బెదిరిస్తున్నారని.. రైతుల మెడపై కత్తి పెట్టి మరీ వేధిస్తూ బ్యాంకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. అయ్యా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు డిసెంబర్ 9 గుర్తుందా? లేదా? అని నిలదీశారు. అధికారం మత్తులో మునిగి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలులో పడి ఆ తేదీ, రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. అధికారం దక్కగానే ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వాటిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అన్నదాతల ఆగ్రహానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9 న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్లేనా?
రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే,పాత అప్పు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు రైతుల మెడపై కత్తి పెట్టి వేధిస్తూ,వసూలు చేస్తున్నారు.… pic.twitter.com/U5Hvtv2EXJ— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 4, 2024