వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 12 : తమ సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆగని వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు తేల్చిచెప్పారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థుల ైస్టెపెండ్తో పాటు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఎదుట పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించా రు. అక్కడే దీక్షా శిబిరంలో బైఠాయించి నిరస న తెలిపారు.
తమ చదువులు పక్కనపెట్టి సమస్యలు పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి చాంబర్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పరిపాలన నుంచి పీజీ, పీహెచ్డీ విద్యార్థుల ైస్టెపెండ్ పెంపును ఆమోదించినా ప్రభుత్వ అనుమతి లేక అమల్లోకి రాలేదని ఆందోళన వ్యక్తంచేశారు. హామీ ఇచ్చి రెండేండ్లయినా స్పందించకపోవడంతో పరిశోధక విద్యార్థులు తీవ్ర నిరాశతో నిరాహార దీక్షకు సిద్ధమయ్యాయరని చెప్పారు. తొలి రోజు ర్సిటీ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్కుమార్, కార్యదర్శి మనోజ్కుమార్గౌడ్, లోకేశ్ ముదిరాజ్, వర్కింగ్ కమిటీ సభ్యులు మౌనిక, సౌజన్య మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.