వనపర్తి: వనపర్తి మండలంలోని చిట్యాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిట్యాలలోని రాజరాజేశ్వరి రైసు మిల్లులో (Rice mill) ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి విస్తరించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో రూ.26 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయని వెల్లడించారు.