హైదరాబాద్ : శంషాబాద్ అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమాన EK524లో హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 409 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ బంగారం విలువ రూ.21.66లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సూట్కేస్ లోపల సపోర్టింగ్ మెటల్ ఫ్రేమ్లో దాచి తరలిస్తుండగా తనిఖీలు చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.