హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా మరోసారి బట్టబయలైంది. ఆయా తరగతుల కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి సర్కార్.. ఆ ని ధుల్లో ఖర్చు చేసింది చాలా తక్కువేనని స్వయంగా అంగీకరించింది. ఈ అంశంపై బుధవారం శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతోపాటు ఇతర కార్పొరేషన్లు, వివిధ ఫెడరేషన్లకు గత రెండున్నరేండ్లలో ఎన్ని నిధులు కేటాయించారు? అందులో ఎన్ని నిధులు విడుదల చేశా రు? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? అని నిలదీశారు. దీంతో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు తదితర 33 సంస్థలకు రూ. 14,522 కోట్లు కేటాయించి, రూ. 3,198.07 కోట్లు విడుదల చేశామని, అందులో రూ.305.6 కోట్లు (2.10 శాతం) మాత్రమే ఖర్చు చేశామని వెల్లడించింది.

(నోట్: 16 సంస్థలకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. మొత్తంగా 33 సంస్థల్లో 22 సంస్థలకు నయాపైసా విడుదల చేయలేదు)