హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.1,410 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ శాఖకు రూ.1,271 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.138 కోట్లు అదనంగా ప్రతిపాదించింది.
వర్సిటీగా రూపుదిద్దుకొంటున్న ములుగులోని ఫారె స్ట్ కాలేజీ, పరిశోధన సంస్థకు రూ.100 కోట్లు కేటాయించింది. 190 ఎకరాల్లో ఉన్న ఎఫ్సీఆర్ఐలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తరగతి గదులు, లైబ్రరీ, హాస్టళ్లు, క్రీడాప్రాంగణాలు, ల్యాబ్లు ఏర్పాటుచేశారు.