దామరచర్ల: నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. బుధవారం రాత్రి ఆలయం తలుపులు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. భక్తులు వేసిన కానుకలు దొంగిలించారు. నిత్య పూజలకై తెల్లవారు జామున ఆలయానికి వచ్చిన పూజారి ఆలయం తలుపులు, హుండీ తాళం పగుల గొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పక్కనే ఉన్న మరో రెండు అలయాల్లోనూ చోరీ జరిగినట్లు గుర్తించారు. సుమారు రూ.లక్ష నగదు, 20 తులాల వెండి ఆభరణాలు దొంగిలించి ఉండొచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.