హైదరాబాద్ : నాగోల్ స్నేహపురి కాలనీలో గురువారం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఓ బంగారం షాపులో ఇద్దరు దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. షాపు యజమానిని బెదిరించి దొంగలు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటనలో దుండగులు మూడు రౌండ్ల బుల్లెట్లు కాల్చినట్లు సమాచారం.
కాల్పుల్లో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నిందితులు రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాకు చెందిన వారిగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.