హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సమీక్షించారు. క్షేత్రస్థాయి అధికారులకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చే అధికారం కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆర్ అండ్ బీ శాఖ పునర్వ్యస్థీకరణలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. డీఈ 2 లక్షలు, ఈఈ 25 లక్షలు, ఎస్ఈ 50 లక్షలు, సీఈ కోటి, ఈఎన్సీ 20 కోట్ల వరకు వినియోగించేలా చర్యలు చేపట్టారని వివరించారు. ఈ అవకాశాన్ని అధికారులు వినియోగించుకొని, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీ రవీందర్రావు, సీఈలు సతీశ్, మోహన్నాయక్, ఎస్ఈలు మోహన్ తదితరులు పాల్గొన్నారు.