కరీంనగర్: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రేణికుంట- కొత్తపల్లి గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ బైక్ ను ఢీ కొని ముగ్గురు దుర్మరణం చెందారు.
మృతులు చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వీరిలో గుడిపెల్లి అరవింద్ (19)అక్కడికక్కడే మృతి చెందగా శివరాత్రి సంపత్ (17), శివరాత్రి ఆంజనేయులు (22) కరీంనగర్ దవాఖానాకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. తిమ్మాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.