రంగారెడ్డి : అతివేగం ముగ్గురు ప్రాణాలను బలిగొంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదం(Road Accident) లో ముగ్గురు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) షాద్నగర్ రహదారిపై అతివేగంగా వచ్చిన బొలెరో ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్(28), శంకర్32), రవి (30) గా గుర్తించారు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు .