జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన బొచ్చు శంకర్ మైలారం వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే, గతేడాది శంకర్ తమ్ముడు సదయ్య గణపురం క్రాస్ రోడ్డు వద్ద బస్సు ఢీకొని మృతి చెందాడు. ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.