మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండ లం మేడిపల్లికి చెందిన బద్దం లక్ష్మి తన వ్యవసాయ భూమిని తమ సంతా నం ఇండ్ల నిర్మాణానికి వ్యవసాయేతర భూ మిగా మార్చేందుకు గత నెల 22న ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్ఐ తిరుపతి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు.
బాధిత కుటుంబం ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మంగళవారం ఆర్ఐ సహాయకుడు భూరం ప్రవీణ్కు రైతు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్ఐతోపాటు, ప్రవీణ్ను అదుపులోకి తీసుకొన్నారు.