హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ పాలన ప్రజలకు మరింత చేరువ అవుతున్నదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నే తలు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో ధరణిపై సీఎం రేవంత్రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్ హాజరయ్యారు.
రైతులు, సాధారణ ప్రజలు ఎదురొంటున్న భూ సమస్యలు, రెవెన్యూ శాఖ పటిష్టత, క్షేత్రస్థాయి సిబ్బంది ఆవశ్యకత తెలియజేస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ద్వారా సీఎంకు నివేదిక అందించినట్టు వారు చెప్పారు. అనంతరం సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు ఫూల్ సింగ్ హన్, ఉపాధ్యక్షుడు రమేశ్ పాక తదితరులు పాల్గొన్నారు.