భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 21: డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ కథనం ప్రకారం.. రేగొండ మండలానికి చెంది న పోడేటి కాంతమ్మ నాలుగేండ్ల క్రితం మరణించింది. కాంతమ్మ కుమారుడు సుదర్శన్ తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం గతేడాది డిసెంబర్లో ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు.
ఇందుకోసం కాంతమ్మ అల్లుడు మల్లికార్జున్ రేగొండ రెవెన్యూ కార్యాలయంలో ఏఎస్వో (అసిస్టెంట్ స్టాటిస్టిక ల్ ఆఫీసర్)గా పనిచేస్తున్న మొగుళ్ల రఘుపతిని కలువగా.. రూ.2 వేలు లం చం డిమాండ్ చేశాడు. ఎన్నిసార్లు కలిసినా ఇలాగే చెప్తుండటంతో మల్లికార్జున్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని.. కలెక్టరేట్ గేటు ఎదుట ఏఎస్వో రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రఘుపతిని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.