ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ రసాభాసగా మారింది. కార్యకర్తల అతి ఉత్సాహంతో గందరగోళం నెలకొంది.
రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు గుంపులు గుంపులుగా స్టేజీపైకి దూసుకెళ్లారు. దీంతో కార్యాలయం రెండు ద్వారాల అద్దాలు ధంసమయ్యాయి. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కార్యకర్తల తీరుపై రేవంత్రెడ్డి అసహనం వ్యక్తంచేశారు.