Revanth Reddy | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక కరుచుకున్నారు. రాజీవ్గాంధీ మాతృమూర్తి ఇందిరాగాంధీని సతీమణి అని వ్యాఖ్యానించడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అంతా తలలు పట్టుకున్నారు. ఆ తరువాత రాజీవ్గాంధీ సతీమణి సోనియాగాంధీ అంటూ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. రేవంత్రెడ్డి ఇలాగే సోయి లేకుండా మాట్లాడుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు.
రేవంత్ క్షమాపణ చెప్పాలి : పెద్ది సుదర్శన్
రేవంత్రెడ్డి సిగ్గులేకుండా, నాలుకపై, మెదడుపై పట్టులేకుండా జుగుప్సాకరంగా మాట్లాడినందుకు వెంటనే తల్లులందరికీ క్షమాపణ చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు దొంగకు, మెదడుపై పట్టు లేని వ్యక్తికి, చంద్రబాబు ఏజెంట్కు పీసీసీ పదవి ఇస్తే.. ఇట్లా అడ్డం తెడ్డం వాగి నడిబజాట్ల తెలంగాణ పరువుతీస్తున్నడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.