హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల వివరాలను రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. మూతబడిన పాఠశాలలను తిరిగి తెరవాలని సీఎం యోచించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికుల నియామకాన్ని పునరుద్ధరించడం ద్వారా 26,065 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపారు.
విద్యా వలంటీర్లను నియమించడం ద్వారా 18,000 మందికి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లను నియమించడం ద్వారా 5000 మందికి ఉపాధి చూపవచ్చని పేర్కొన్నారు. 1,817 సూల్ కాంప్లెక్స్లకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ కం క్లర్ నియామకాలు చేపట్టాలని, సీఆర్పీలు లేని సూల్ కాంప్లెక్స్ల్లో వారిని నియమించాలి కోరారు. గత ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 148 మండలాల్లో ఎంఐఎస్, సీసీవో, మెసెంజర్, ఐఈఆర్పీలను నియమించాలని కోరారు. కుకింగ్, గుడ్డు ధరలను సవరిస్తూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల బిల్లులు వెంటనే గ్రీన్ చానల్ ద్వారా చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్లు, ఫర్నిచర్, బోధనేతర సిబ్బంది నియామకం వంటి వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.