బోధన్, మార్చి 16: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అభాసుపాలైంది. బోధన్లో గురువారం రాత్రి జరిగిన పాదయాత్ర అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది యువకులు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్నర్ మీటింగ్ను అడ్డుకున్నారు. ‘రేవంత్రెడ్డి గోబ్యాక్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, తర్వాత విడుదల చేశారు. కాగా, రేవంత్ పాదయాత్రలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కెప్టెన్ కరుణాకర్రెడ్డి కనిపించలేదు. పాదయాత్రలో ఆయన పాల్గొనకుండా రేవంత్పై మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదీఏమైనా రేవంత్ యాత్రలో సుదర్శన్రెడ్డి, కెప్టెన్ కరుణాకర్రెడ్డి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.