హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి శనివారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కొంతసేపు ముచ్చటించారు.
సచివాలయానికి వెళ్లిన మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రేవంత్ శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.