హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జంటనగరాల కార్మికశాఖ జాయింట్ కమిషనర్ సునీతాగోపాల్దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా రిటర్నింగ్ అధికారి పర్యవేక్షించనున్నారు.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అర్హులైన ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెకింపు, ఫలితాల వెల్లడి, ఎన్నికల ప్రక్రియలో తలెత్తే వివాదాలు, సమస్యల పరిషారం వంటివన్నీ నిబంధనల ప్రకారం ఆమె పర్యవేక్షణలోనే జరుగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల పూర్తి షెడ్యూల్, పోలింగ్ కేంద్రాలు, ఓటరు అర్హత ప్రమాణాలు, ఇతర ప్రక్రియల వివరాలను రిటర్నింగ్ అధికారి త్వరలోనే విడిగా నోటిఫికేషన్ ద్వారా ప్రకటించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, క్రమశిక్షణతో ముగిసేలా అన్ని కార్మికసంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు, భాగస్వామ్యపక్షాలు పూర్తి సహకారం అందించాలని కార్మిక శాఖ విజ్ఞప్తి చేసింది.