Rythu Bandhu | బోధన్, ఫిబ్రవరి 24: రైతుబంధు సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండించకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు కమిటీ సభ్యులైన ఎ మ్మెల్యే పీ సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, షుగర్ కేన్ డైరెక్టర్ మల్సూర్ శనివా రం నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని శక్కర్నగర్లో గల నిజాం షుగర్స్ను సందర్శించారు.
చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ని జాం షుగర్స్ పునరుద్ధరణకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతిని మా ర్చి 2న అధికారికంగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.