ముగ్గురు ప్రముఖులకు 10 వేల గౌరవ పింఛన్
కళాకారులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తున్నది. ప్రముఖ కళాకారులైన 12 మెట్ల కిన్నెర విద్వాంసుడు దర్శనం మొగులయ్య, గుస్సాడీ నృత్యకళాకారుడు, పద్శశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్భూషణ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.10వేల ప్రత్యేక పింఛన్ను ఇవ్వనున్నారు. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో కనకరాజు, మొగులయ్యను ఘనంగా సత్కరించారు. ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథి అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసి, ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరికొంతమందిని కళాసారథులుగా ఎంపికచేసేందుకు సిద్ధమవుతున్నది. వృద్ధ కళాకారులకు ఇస్తున్న రూ. 1,500 పింఛన్ను ఇటీవలే రూ. 3,015కు పెంచింది. బుధవారం నుంచి పెంచిన పింఛన్ను అమలుచేయనున్నది.