హైదరాబాద్/సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తేతెలంగాణ): ఒకప్పుడు ‘స్త్రీలకు మాత్ర మే’ అన్న బోర్డులతో ప్రత్యేక బస్సులు నడిచే వి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘మహాలక్ష్మి’తో ప్రస్తుతం మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పురుషులకు కనీసం నిల్చునే స్థలం ఉండటం లేదు.
దీంతో ‘పురుషులకు మాత్రమే’ పేరుతో ఆర్టీసీ ప్రత్యే క బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని ఇబ్రహీంపట్నం-ఎల్బీనగర్ రూట్లో 277 నంబర్ బస్సును ప్రయోగాత్మకంగా గురువా రం ప్రారంభించింది. ఉదయం 8.30 గంటలకు ఒక ట్రిప్పు, సాయంత్రం 4.30కు మరో ట్రిప్పు నడపాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో యాజమా న్యం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది.