హైదరాబాద్ : 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.#RepublicDay pic.twitter.com/edYx6EPMSu
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2023