హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్.. నేడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వెంకన్న మృతిలో కుట్ర కోణం లేదని, ప్రమాదవశాత్తు సంభవించిన మరణమేనని విచారణలో ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. సోమవారం రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తికి నివేదికను అందించనున్నట్టు తెలిసింది.