మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 12: మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల గుర్తింపును పునరుద్ధరిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులను జారీ చేసిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేశ్ తెలిపారు. బుధవారం కళాశాలలోని చాంబర్లో ఆయన మాట్లాడుతూ.. దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ఎలాంటి అభ్యంతరం లేకుండా 175 సీట్లకుగానూ 2023-24 విద్యాసంవత్సరం జరగాల్సిన ప్రవేశాలు యథావిధిగా ఉంటాయని స్పష్టం చేశారు.