హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వ్యవసాయ మారెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు వారు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ మారెట్ కమిటీల పనితీరును పరిశీలించేందుకు 6 ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, ఈ బృందాలు రాష్ట్రంలోని అన్ని మారెట్ కమిటీలను వారం రోజులపాటు తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ) : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో విత్తన మేళా నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకులు బీ గోపి తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో తకువ నీటితో పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రతి రైతువేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నట్టు ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు.