మండుటెండల్లోనూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గత నెలలో రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్కు గోదావరి జలాలను విడుదల చేయడంతో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు మత్తళ్లు దుంకుతున్నాయి. ఆనందంతో రైతులు ఆదివారం విఠలాపూర్ చెరువు మత్తడి వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రంగనాయక్సాగర్ కెనాల్ సహాయంతో తమ గ్రామంలోని 120 ఎకరాలకు నీరందుతున్నట్టు విఠలాపూర్ సర్పంచ్ మద్దికుంట నవీన్ తెలిపారు. – చిన్నకోడూరు