హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్(డీసీఏ), తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బుధవారం సీఈవో వికాస్రాజ్ను డీసీఏ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, కార్యదర్శి రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్షుడు రాములు, కార్యదర్శి రమేశ్ పాక కలిసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన సిబ్బందికి బిల్లులు అందలేదని వివరించారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పాత బిల్లులు విడుదల చేయాలని కోరారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బిల్లులు మంజూరైనా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లులన్నింటినీ విడుదల చేయాలని కోరారు.