హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మక్క రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మార్క్ఫెడ్కు రూ. 171 కోట్లు విడుదల చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బకాయిలను ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించారు.
వానకాలంకు సంబంధించి 78,500 మంది రైతుల నుంచి 3.77 లక్షల టన్నుల మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసిందని, క్వింటాల్కు 2,400 చొప్పున 907 కోట్లు చెల్లించాలని తెలిపారు. తొలిదశలో 735.39 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. మిగిలిన 171.61 కోట్లను బకాయి పెట్టిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మార్క్ఫెడ్కు రుణ సేకరణ కోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందని, దీంతో ఆ నిధులను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.