హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ ) మంగళవారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అనంతరం తమ నిర్ణయాన్ని చెబుతామని బోర్డుకు తెలిపారు.