Bandi Sanjay | కరీంనగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతి హిందీ ప్రశ్నపత్ర లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య దశాబ్దానికి పైగా సంబంధం ఉన్నది. ఏ సమయంలోనైనా సరే బండిని కలవాలంటే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్రీ ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హనుమకొండ జిల్లాకు చెందిన బూరం ప్రశాంత్.. బండి సంజయ్ అనుచరుడే కాదు, ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇప్పటికే అనేక సాక్ష్యాలు లభ్యమయ్యా యి. 2011-12లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏబీవీపీ ఇన్చార్జిగా ప్రశాంత్ వ్యవహరించారు. అదే సమయంలో బండి సంజయ్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్గానూ కొనసాగుతున్నారు. ఆ సమయంలోనే ప్రశాంత్ ఇన్చార్జిగా కరీంనగర్కు రావడంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. అప్ప ట్లో ఏబీవీపీ చేపట్టిన కార్యక్రమాల్లోనూ ప్రశాంత్, సంజయ్ కలిసి పాల్గొన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. బండి ఎంపీ అవడం, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత ఈ బంధం మరింత బలపడింది. సంజయ్ ఎక్కడున్నా సరే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తున్నది. వీటన్నింటిని నిశితంగా పరిశీలిస్తే బండితో పెనవేసుకున్న బంధమే నిందితుడిని హిందీ పేపర్ లీకేజీ వరకు తీసుకెళ్లినట్టుగా భావిస్తున్నారు. హిందీ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించిన సమాచారం సైతం, బండికి ఎప్పటికప్పుడు తెలిపి ఉంటారని, సంజయ్ సూచన మేరకే ప్రశాంత్ సదరు హిందీ ప్రశ్న పత్రాన్ని వివిధ పత్రికలకు, చానళ్లకు పంపడంతోపాటుగా బండికీ పంపించారని తెలుస్తున్నది. మొత్తంగా పేపర్ లీకేజీ వ్యవహారంలో ఒక పథకం ప్రకారమే ఇద్దరు కలిసి వ్యవహారం నడిపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.