హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో పని చే స్తున్న బదిలీ వరర్లకు యాజమా న్యం తీపి కబురు చెప్పింది. 2,266 మంది ని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించింది. ఈ మేరకు శనివారం సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో డైరెక్టర్ బలరామ్ ఉత్తర్వులు జారీచేశారు. సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు. ఏడాదిలో భూగర్భ గనుల్లో కనీసం 190 రోజులు, ఉపరితల గనులు, వివి ధ విభాగాల్లో కనీసం 240 రోజులు పని చేసిన బదిలీ వరర్లను రెగ్యులరైజ్ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. క్రమశిక్షణతో పనిచేసే వారికే గుర్తింపు వస్తుందని డైరెక్టర్ బలరామ్ చెపారు.
ఏరియాల వారీగా..
శ్రీరాంపూర్ ఏరియాలో అత్యధికంగా 677 మందిని క్రమబద్ధీకరించారు. రామగుండం-1 ఏరియాలో 522, ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు లో 323, భూపాలపల్లిలో 274, మందమర్రిలో 261, మణుగూరులో 79, రామగుండం-2లో 51, బెల్లంపల్లి ఏరియాలో 32, ఇల్లందు, కార్పొరేట్ల నుంచి 19 మంది చొప్పున ఎం పిక కాగా, కొత్తగూడెం నుంచి 9 మం ది రెగ్యులరైజ్ అయ్యారు. సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు 2017 నుంచి నేటి వరకు 13,981 మందిని రెగ్యులరైజ్ చేశారు.